3వ వార్డులో ఆరణి శ్రీనివాసులు ప్రచారం

తిరుపతి ప్రచారంలో భాగంగా 3వ వార్డ్ లో సోమవారం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో జనసేన జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు బాలసుబ్రమణ్యం బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అరణి శ్రీనివాసులును 3వ వార్డ్ జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు ఆనంద్, హేమకుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం ఘనంగా ఆహ్వానించారు. తిరుపతి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అభ్యర్థి అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అభివృద్ధి బాట పట్టించాలంటే తమను గెలిపించాలని కోరారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి టీడీపీ, బీజేపీలతో కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి పూనుకున్నారన్నారు. మార్పుకి అవకాశం వచ్చింది, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఈరోజు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వాలి. ప్రస్తుత అధికార పార్టీ ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న విధానాన్ని చూసి ప్రజల కష్టాలను తీర్చే వారు కరువయ్యారు అని పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచనలతో చంద్రబాబు మోడీల సహాయంతో యువతకి భరోసా, మహిళలకు అండగా, వృద్దులకు ఆసరాగా ఉండాలని నిశ్చయించుకొని ప్రజా క్షేత్రంలోకి కూటమితో రావటం జరిగింది. ఉమ్మడి అభ్యర్థి విజయమే రాష్ట్రంలో ఆరాచక పాలనకు చరమగీతం పాడుతుందన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే తమకు శిరోధార్యం అన్నారు. అధినేత నియమించిన అరణి శ్రీనివాసులుని తిరుపతి నుంచి గెలిపించి కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ స్థానిక నాయకులు జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర కమిటీ నాయకులు వార్డ్ అధ్యక్షులు జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.