కసింకోట జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

అనకాపల్లి నియోజకవర్గం కసింకోట గ్రామంలో ఎస్.బి.ఐ బ్యాంక్ దగ్గర ఉన్న జనసేన జండాదిమ్మ వద్ద మన జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో భాగంగా 7వ సిద్ధాంతం పర్యావరణాన్ని రక్షించే సమాజం దీనికి అనుసంధిస్తూ వినాయక చవితి సందర్భంగా మనగళవారం మట్టి విగ్రహాలను పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నాయకులు తాడి రామకృష్ణ, గంగపాము జగదీష్, బన్నీకన్న రాము, అప్పికొండ గణేష్, మల్లా శ్రీను, గొల్లవిల్లి రాజా, మల్ల వంశి, పెద్దాడ సాయి మరియు కసింకోట మండల నాయకులు గల్లా కొండలరావు, కోటిని గణేష్, మొరం మోహన్, పవన్ నాయుడు బొబ్బరి, పల్లపోతుల సంతోష్, చిట్టి నాగేష్, అంబటి వరహాలరావు, నక్క శ్రీను, అయినాల నాయుడు, ఆర్ శ్రీను, కోరుకొండ అభిలాష్, కొనిశెట్టి శివ, సుంకర మహేష్, సింబోతుల లలిత్ కుమార్ తదితర జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. తద్వారా అధినాయకుడు చెప్పిన మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలిపారు.