చీరాల అసెంబ్లీ సీటు దళితులకు కేటాయించాలి: గూడూరు శివరామప్రసాద్
చీరాల నియోజకవర్గంలో దళితులకు అసెంబ్లీ సీటు కేటాయించాలని జనసేన నాయకులు గూడూరు శివరామప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ చిరంజీవి అభిమానిగా, ప్రజారాజ్యం పార్టీలో కీలకపాత్ర పోషించానని అలాగే జనసేన నాయకుడిగా పార్టీ పెట్టిన నాటి నుంచి జెండా మోస్తూ ప్రతి కార్యక్రమాన్ని ప్రజలవద్దకు తీసుకెళ్తున్నానని అన్నారు. చీరాల లో అత్యధికంగా ఎస్ సి లు ఉన్నారని ఇక్కడ అసెంబ్లీ సీటు కేటాయిస్తే బీసీలను కలుపుకుని పార్టీని గెలిపిస్తానని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-17-at-20.56.22.jpeg)