పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ చే అగ్ని ప్రమాద బాధితులకు సాయం

తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ అమలాపురం రూరల్ తాండవపల్లి గ్రామంలో అగ్నికి మూడు తాటాకుల ఇల్లు దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వరరావు, జనసేన ఎంపీటీసి మోటూరి కనకదుర్గ ధన సహాయంతో బాధిత కుటుంబాలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పెద్దలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.