పాత్రికేయులపై దాడులు సమర్థనీయం కాదు: దారం అనిత

రాష్ట్రంలో పాత్రికేయులపైన దాడులు రోజు రోజుకు పెరిగిపోయాయని, మదనపల్లిలో విలేఖరి వెంకశివపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దారం అనిత డిమాండ్‌ చేశారు. వైసిపి భూ కబ్జా దారుల దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటశివ చికిత్స పొందుతున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం వచ్చిన తరువాత రాష్టంలో పత్రికలపైన పాత్రికేయలపైన దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయంగా వార్తలు రాసే వెంకట శివపై వైసిపి నాయకుల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసిపి నాయకులు చేసే భూ కబ్జాలపై వార్త రాసిన వెంకట శివపై దాడి చేసిన వెంకటేశ్వర రెడ్డి, మహేశ్వర రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ‌కేసు నమోదు చేయని పక్షంలో జనసేన తరుఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.