అవనిగడ్డ మండల జనసేన అధ్యక్షులు శేషుబాబు హౌస్ అరెస్ట్
అవనిగడ్డ నియోజకవర్గం: సున్నా వడ్డీ పథకం 4వ విడత జిల్లా స్థాయి కార్యక్రమంను ప్రారంభించడానికి అవనిగడ్డకు విచ్చేస్తున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన అభ్యుదయ శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజాకు హంసలదీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మరియు ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డికి అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు విడుదల చేయించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి సిద్దమయిన అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబును, జనసైనికులను శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతి ఇస్తే మాత్రమే బయటకు రావాలని పోలీసులు శేషుబాబుకు సూచించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-11-at-1.49.14-PM-1024x461.jpeg)