దిల్‌సుఖ్‌నగర్‌ బాబా ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ అందజేత

పాలకవర్గం 30ఏళ్లుగా ఓర్పుతో అందిస్తున్న సేవలు, ఆలయ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాల ఫలితంగా  దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా దేవాలయానికి ఐఎస్‌ఓ 9001 క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ లభించింది. ఈ సర్టిఫికెట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా దేవాలయ కమిటీ ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవితతో పాటు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌లకు ఆలయ పూజారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ బచ్చు గంగాధర్‌, ఉపాధ్యక్షుడు నర్సింహ గుప్తా, నాగేశ్వర శర్మ, సాయికుమార్‌ తదితరులు వారిని ఘనంగా సన్మానించారు.