తుని జనసేన ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చలివేంద్రం

తుని నియోజకవర్గం, తుని టౌన్ రెండవ వార్డు జనసేన నాయకులు మీలా కొండబాబు మరియు వారి సన్నిహితులు రెసుగుర్రం టీమ్ కలిసి తుని రెండవ వార్డులో డా. బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో గురువారం బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తుని టౌన్ జనసేన నాయకులు అద్దేపల్లి బాలాజీ చేతులమీదుగా ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో వేగిశెట్టి రమణ, గడ్డమూరి సురేష్, సలాది ఉదయ, అడపా కన్నా, జాగు సతీష్, శివ, వెంకన్న మరియు తుని జనసైనికులు పాల్గొనటం జరిగింది.