పుంగనూరులో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ

పుంగనూరు, బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ చల్లా బాబు, జనసేన ఇంచార్జీ పగడాల రమణ ఆదేశాల మేరకు శుక్రవారం పుంగనూరు మండలం మొదుగులపల్లి పంచాయతీ, ఎంసీ పల్లి పంచాయతీలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వైసిపి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకుని రాబోయే టిడిపి జనసేన ప్రభుత్వంలో అములు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపి మండల అధ్యక్షులు మాధవ్ రెడ్డి, విరూపాక్ష, టౌన్ అధ్యక్షులు నరేష్, సివి రెడ్డి, పోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్, ఐటీడీపి ప్రధాన కార్యదర్శి బి కుమార్, గంగాధర, రూరల్ ప్రధాన కార్యదర్శి హరీ నాయక్, బాలాజీ నాయక్, మురళి రాయల్, మరియు నాయకులు పాల్గొన్నారు.