జనవాణి కార్యక్రమం నుంచి దృష్టి మళ్ళించేందుకే వైసీపీ నాటకాలు: బాడిశ మురళీకృష్ణ

జగ్గయ్యపేట, పవన్ కళ్యాణ్ పర్యటనను దృష్టి మల్లించేందుకే వైసీపీ నాటకాలు ఆడుతుందని ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖ విమానాశ్రయంలో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్రమంత్రులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లుగా గాని అది జనసేన చేసినట్లుగా గాని ఎక్కడా రుజువుకాలేదని మంత్రుల మీద దాడి జరిగితే వాళ్లకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నట్లో సమాధానం చెప్పాలన్నారు. అలా జరిగితే అది కచ్చితంగా పోలీస్ శాఖ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ జనసందోహం వచ్చింది కావున జనవాణి కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని మరియు మీడియా దృష్టిని మళ్లించేందుకు వైసిపి కొత్త నాటకానికి తెరతీసిందని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో ఊరేగింపుగా వస్తుంటే వీధి దీపాలు వెలగకుండా కట్ చేశారని అలాగే మా జనసేన పార్టీ నాయకులను పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ లు చేసి మీ మూర్ఖత్వపు వైఖరిని తెలియజేసారని ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ది చెప్తారని మురళీకృష్ణ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, గోపాలరావు, చందు గోపాల్ కిరణ్ తదితరులు. పాల్గొన్నారు.