బహుదానది పిల్ల కాలువ వంతెన నిర్మాణానానికి జనసైనికుల ఆర్దిక సహకారం

  • జనసైనికులను అభినందించిన ఇచ్చాపురం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం మండలం, బూర్జిపాడు గ్రామం రైతులకు, జనసైనికులు బహుదానది పిల్ల కాలువ కలినడక వంతెన స్వయంగా సొంతనిధులతో నిర్మించినందుకు ఇచ్చాపురం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఏళ్ల తరబడి అవుతున్నప్పటికి కూడా బూర్జిపాడు సమీపంలో ఉన్న బాహుదనది పిల్ల కాలువ కాలినడక వంతెన నిర్మించడంలో ప్రభుత్వాలకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ రైతులు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా నిర్మాణం పూర్తి చేయలేదు కనుక బూర్జిపాడు రైతులే ముందుకు వచ్చి కాలువకు అటువైపు సుమారు 400 ఎకరాల కోసం కాలినడకన వెళ్ళవలసిన వంతెనని నిర్మించుకోవడానికి ముందడుగు వేయడం జరిగింది. రైతులు ముందు అడుగు వేయడంతో సుమారు 5 లక్షల రూపాయిలు ఈ నిర్మాణానికి కావలసిన నిధులు కోసం సమీక్షిస్తున్న తరుణంలో బూర్జిపాడు జనసైనికులు సుమారు 3లక్షల 50 వేలు రూపాయిలు వారికి ఆర్ధిక సహాయం అందించడంతో పాటు, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు చేయవల్సిన పనులు ప్రజలే తమ సొంత నిధులతో చేసుకుంటున్నందుకు సిగ్గు చేటుగా ఉంటుందని, ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని ఇలాంటి పనుల్లో అలసత్వం వహించకుండా ముందు అడుగు వేయాలని జనసేన పార్టీ తరపున దాసరి రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బూర్జపాడు డొంకూరు జనసైనికులు మరియు రైతులు పాల్గొన్నారు.