అంజనేయులుకు వైద్యం చేయించిన బాల్యం రాజేష్

కళ్యాణదుర్గం: జనసేన పార్టీ బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు అంజనేయులుకు ఇటీవల ఒక ప్రమాదంలో కాలుకు పెద్ద దెబ్బ తగలడంతో కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఆదివారం తాను స్వయంగా హాస్పిటల్ కు పిలిపించి, తన సొంత డబ్బుతో ఎక్స్ రే తియించి, దగ్గరుండి ప్రత్యేకంగా డాక్టర్ల తో మాట్లాడి చికిత్స చేయించారు. ఆయన వెంట కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు శ్రీహర్ష, చరణ్, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు తదితరులు జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ వెంట ఉన్నారు.