బావిలోని పూడిక మట్టి తీసేందుకు వెళ్లి మృతి చెందిన వారి పార్దీవ దేహాలను పరామర్శించిన బండ్రెడ్డి రామకృష్ణ..
శనివారం పెడన నియోజకవర్గంలో బంటుమిల్లి గ్రామంలో నలుగురు కలిసి బావిలోని మట్టి తీసేందుకు వెళ్లిన క్రమంలో నలుగురు మృత్యు వాత పడ్డారు. వీరిలో ఒకరు ఇంటి యజమాని కాగా, ఇద్దరు బంటుమిల్లి బిఎన్ఆర్ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు, మరొకరు ములపర్రు గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహాలను పరామర్శించి ఆ నలుగురు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ 5000 ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండలం అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, పెడన మండల అధ్యక్షులు, వెంకయ్య, గుడూరు మండలం అధ్యక్షులు సాయిరామ్, బంటుమిల్లి మండలం ఉపాధ్యక్షులు రవికిరణ్, పెడన మండలం ఉపాధ్యక్షులు చీర్ల నవీన్ కృష్ణ బంటుమిల్లి మండలం ప్రధాన కార్యదర్శి బత్తుల సాంబమూర్తి, బాబీ, బంటుమిల్లి మండల కార్యదర్శిలు దూడల పాండురంగా, సుబ్బు మారుబోయిన, చిటికినేని రవితేజ, పుప్పాల సూర్యనారాయణ, వెంట్రపాటి నాగబాబు, పినిశెట్టి రాజు, బంటుమిల్లి మండల జనసేన పార్టీ కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.