శ్రీశ్రీశ్రీ వరాల సత్తెమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని, పలివెల గ్రామ శివారు శేరేపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ వరాల సత్తెమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్. ఆదివారం ఆలయంలో అమ్మవారికి జనసేన కార్యకర్తల సమక్షంలో అభిషేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వాదం బండారు శ్రీనివాస్ తీసుకున్నారు. అనంతరం అమ్మవారి దీవెనలు అందుకుని ఆలయ ప్రాంగణంలో ఎంతో ఉత్సాహంతో, ఆలయమునకు వచ్చిన గ్రామ ప్రజలను పలువురిని పేరుపేరునా పలకరిస్తూ ఎంతో మర్యాదపూర్వకంగా అందరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ వరాల సత్తెమ్మ అమ్మవారికి పలువురు భక్తులు అనేక రకాల పిండివంటలతో, బూరెలు గారెలతో నైవేద్యం సమర్పించారు. అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాస్ వెంట కొత్తపేట మండలంలోని పలువురు జనసైనికులు, కార్యకర్తలు , పలివెల గ్రామ జనసైనికులు, శేరేపాలెం గ్రామం జనసైనికుల పాల్గొని శ్రీశ్రీశ్రీ వరాల సత్తెమ్మ తల్లి దీవెనలు అందుకున్నారు.