కుటుంబ పెద్దను కోల్పోయిన పెదపల్ల జనసైనికుడు, ముద్దన రాంబాబుకు అండగా నిలిచిన బండారు శ్రీనివాస్!

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఈరోజు ఆలమూరు మండలంలోని పెద పళ్ళ గ్రామానికి చెందిన ముద్దన రాంబాబు వారి తల్లి ఇటీవలే స్వర్గస్తులైన కారణంగా వారికి, వారి కుటుంబానికి అండగా నిలిచిన బండారు శ్రీనివాస్. పెదపల్ల జనసేన పార్టీకి మంచి యాక్టివ్ మెంబర్ గా పలు సేవాకార్యక్రమాల్లో జనసైనికులుతో పాలు పంచుకుంటూ, పెదపల్లలో జనసేనపార్టీని ముందుకు నడిపిస్తున్న తన ముఖ్య అనుచరుడు, కార్యకర్త అయిన ముద్దన రాంబాబును, ఎంత ధైర్యంతో ఉండాలని, బండారు శ్రీనివాస్ ఓదార్చారు. ఒక నాయకుడిగా తన కార్యకర్తలను, జనసైనికులను, కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పార్టీని నియోజకవర్గంలో ఎంతో బలోపేతమైన స్థాయికి తీసుకెళ్ళిన ప్రముఖ జనసేన నేతగా బండారు శ్రీనివాస్ అందరి మన్ననలను పొందుతున్నారని, కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడే వాడే నిజమైన నాయకుడు! అతడే బండారు శ్రీనివాస్ అని పలువురు గ్రామ ప్రజలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అనుచరులు రాష్ట్ర ఎస్సీ సెల్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ తాళ్ల డేవిడ్ రాజు, పినపల్ల సర్పంచ్, జిల్లా కార్యదర్శి సంగీత సుభాష్, ప్రముఖ జనసేన సీనియర్ నాయకులు గారపాటి త్రిమూర్తులు, సీనియర్ నాయకులు ధనరాజ్ నాయుడు, ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సురపురెడ్డి సత్య, ప్రముఖ బీసీ జనసేన నాయకులు దేసాబత్తుల సత్యనారాయణ, బైరీ శెట్టి రాంబాబు, పలువురు జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.