మాజీ ఎంపీటీసీ రాయుడు లక్ష్మణరావును పరామర్శించిన బండారు

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం, చొప్పెళ్ళ గ్రామం మాజి ఎంపీటీసీ రాయుడు లక్ష్మణరావు, అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో చేరిన విషయం తెలుసుకున్న, జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జి బండారు శ్రీనివాస్ బుదవారం రాయుడు లక్ష్మణ రావును పరామర్శించి దైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య విషయం గురించి వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ మాజి ఎంపీటీసీగా లక్ష్మణ రావు అయనకు సుపరిచితులు అని, ప్రజల సమస్యల కొరకు రాజీ పడకుండా ప్రశ్నించే వారు అని,అన్ని విషయాల్లో సూటిగా వ్యవహరించే వ్యక్తిత్వం గల మనిషి అని, రాయుడు లక్ష్మణ రావు, త్వరగా కోలుకోవాలని, భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి జనసేన కుటుంబం అన్ని రకాలుగా తోడుంటుందని, అధైర్య పడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ డేవిడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, జిల్లా కార్యదర్శి దొంగా సుబ్బారావు, ఆత్రేయపురం మండల అధ్యక్షులు జనసేన చేకూరు కృష్ణంరాజు సలాధి జయప్రకాష్ నారాయణ(జెపి) రావులపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట స్వామి, అంబటి కిషోర్, ఇతకోట గ్రామ పార్టీ అధ్యక్షులు యర్రంశెట్టి రాము, నంబు రవి, పవన మణికంఠ జనసైనికులు పాల్గొన్నారు.