రావులపాలెం, ఆత్రేయపురం మండలాలలో పర్యటించిన బండారు

*కష్టాల్లో ఉన్న కార్యకర్తలను, ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసే గొప్ప నాయకుడు బండారు శ్రీనివాస్.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సోమవారం రావులపాలెం, ఆత్రేయపురం మండలాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ముందుగా రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో జనసేన పార్టీకి చెందిన జనసేన యువత అధ్యక్షులు గంధం సూరిబాబు తండ్రి గంధం నాగయ్యకు ఇటీవల కాలంలో కుడి భుజంనకు సర్జరీ చికిత్స జరిగినదని, తెలుసుకుని వారిని కలుసుకుని కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.బండారు శ్రీనివాస్ వెంట, సలాది జయ ప్రకాశ్ నారాయణ (జెపి), నంబు రవి, పలువురు జనసైనికులు, కార్యకర్తలు కలిసి గంధ నాగయ్యను వారి కుటుంబ సభ్యులను కలిసి ఎంతో ఆత్మీయతతో మాట్లాడారు. ఇటీవల కాలంలో స్వర్గస్తులైన గంధంవారిపాలెం గంధం వీరాస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు ,అనంతరం అక్కడి నుంచి ఆత్రేయపురం బయలుదేరి, ఇటీవల కాలంలో స్వర్గస్తులైన యాతం వెంకట్రావు, కుటుంబ సభ్యులను, కుమారుడు యాతం నరసింహ మూర్తిని పరామర్శించారు. ఆత్రేయపురం మండలం జనసేన అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజుతో కలిసి బండారు శ్రీనివాస్, యాతం వారి కుటుంబ సభ్యులకు, ధైర్యం చెప్పి, కుటుంబ పెద్ద లేని లోటు ఎవరూ పూడ్చలేనిది, ధైర్యంగా ఉండాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సలాది జయ ప్రకాశ్ నారాయణతో పాటు పలువురు జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.