జనసైనికుని వివాహానికి ముఖ్య అతిధిగా బండి నరేష్

సత్తుపల్లి నిజాయకవర్గం, కల్లూరు మండలం, పేరువంచ గ్రామంలో జనసైనికుడు మెంతుల యతీశ్, భవానీల వివాహనికి సత్తుపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి బండి నరేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా ఆ వివాహంలో ఒక 20 క్రియాశీలక సభ్యత్వాలు చేయించటం జరిగింది. జనసేన పార్టీనీ గుర్తు ఉంచుకొని గాజు గ్లాస్ కి ఓటు వెయ్యాలి అని వధూవరులు గాజు గ్లాసుఇ పెళ్లికి వచ్చిన వారికి చూపించడం జరిగింది. ఇలా వినూత్నముగా కొన్ని వందల మంది మధ్యలో పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని ఇలా చూపడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శరత్, సైఫ్, కల్లూరు మండల అధ్యక్షులు పరిమి భరత్, కల్లూరు మండల ఉప అధ్యక్షులు గాదె కిరణ్, పేరువంచ గ్రామ అధ్యక్షులు రామకృష్ణ మరియు జనసైనికులు గోపాలరావు, రవీంద్ర, మురళి, బన్నీ, ఉనిత్ పాషా, యల్లేశ్వరావు, వెంకటచారి, సైదులు, ఉదయ్ కిరణ్, రవితేజ, నీలపాల గోపాల్, సాయి, మరీకొంత మంది జనసైనికులు పాల్గొన్నారు.