తన్నీరు గోపినాధ్ కు భీమా చెక్కు అందజేసిన బండ్రెడ్డి రామకృష్ణ

జగ్గయ్యపేట నియోజకవర్గం: పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు తన్నీరు గోపినాధ్ 2022 డిసెంబర్ 14న ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలపాలవడం జరిగింది. గోపినాధ్ జనసేన క్రియాశీలక సభ్యత్వం కలిగిఉన్నందున దాని నిమిత్తం 42 వేల రూపాయల ప్రమాద బీమా చెక్కుని ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ చేతుల మీదగా తన్నీరు గోపినాధ్ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళా విభాగ అధ్యక్షురాలు రావి సౌజన్య, మండల అధ్యక్షులు తునికిపాటి శివ, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడీశ మురళీకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి కిషోర్, జిల్లా నాయకులు జగ్గయ్యపేట నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.