డిజిటల్ క్యాంపెయిన్ లో బాపట్ల జనసేన పార్టీ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-2.38.05-PM-1024x460.jpeg)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ లో బాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో 3వ,రోజు జనసేన పార్టీ కార్యకర్తలు లో ప్లేకార్డ్ తో నిరసన చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి, ఆరమళ్ళ సుజిత్, గోగన ఆదిశేషు, కొట్రా మణికంఠ,తదితర జనసైనికులు పాల్గొన్నారు.