చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో జనసేనలో బారీ చేరికలు

ధర్మవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 23 వ వార్డ్ సాయి నగర్ కు చెందిన 30 కుటుంబాలు చేరడం జరిగింది. వారు సాకే మహేష్, తలారి ప్రవీణ్, చెరుకు సాయి, బెస్త శివ, కదిరి బాలాజీ, సాకే యోగేష్, నెమలి హేమంత్ కుమార్,చాకలి గోపి, సాకే ప్రేమ్ కుమార్, కమల సాయి, జూటూరు అఖిల్, అజిషా నూర్ మహమ్మద్, రాగినేని సాయి కిరణ్, ఎట్టి రవితేజ, సాకే మోక్షిత్, గుజ్జుల ప్రవీణ్ కుమార్, వల్లెపు మనోహర్, బన్వత్ చరణ్ కుమార్.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ.. కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని పిలుపునివ్వడం జరిగింది.