అక్రమ త్రవ్వకాలను పరిశీలించిన గాదె

గుంటూరు జిల్లా క్రోసూరులో, చెరువులో విచ్చలవిడిగా అధికార పార్టీ నాయకులు మట్టి తవ్వకాలు జరపడంతో.. త్రవ్వకాలను గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించి.. అక్రమ తవ్వకాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీకి చెందిన, షాడో సర్పంచ్, షేక్ మస్తాన్ అనే వ్యక్తి, అక్రమ తవ్వకాలతో, కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని.. అదేమని అడిగితే అడిగిన వారిపైఅక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని.. ఆరోపణ చేశారు. ఒక ట్రక్కుకు, 200 రూపాయలు, లారీకి వెయ్యి రూపాయల చొప్పున లోడింగ్ కి, వేలాది ట్రక్కులు వేలాది లారీల మట్టి తరలించారని, ఇలా వందలాది లారీలు తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని, వైసిపి నాయకులుపై మండిపడ్డారు. ఇకనైనా అక్రమ తవ్వకాలు మానుకోకపోతే రెండు రోజుల తర్వాత పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. జనసేన పార్టీ తరఫున, సమస్యలపై పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని, దానికి జనం సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యరావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి నక్క వంశీకృష్ణ, గుంటూరు జిల్లా జనసేన పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ, గుంటూరు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు శాఖమూరి శ్రీనివాస్, గుంటూరు జిల్లా లీగల్ కమిటీ సంయుక్త కార్యదర్శి బయ్యవరకు నరసింహారావు, అచ్చంపేట మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మట్టం వీరభద్రరావు, సత్తెనపల్లి నియోజకవర్గం సిరిగిరి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.