బత్తుల త్రిమూర్తులును గౌరవపూర్వకంగా కలిసిన “బత్తుల”

  • బత్తుల త్రిమూర్తులు అనుభవం, సేవలు రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో అవసరం బత్తుల
  • టిడిపి, జనసేన పార్టీలు సమన్వయంతో పని చేద్దాం
  • ఐకమత్యంగా రాబోవు ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని జనసేన టిడిపి సత్తా చూపిద్దాం
  • రాజానగరం నియోజకవర్గం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను గౌరవపూర్వకంగా కలిసిన “బత్తుల”

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ జడ్పీటీసీ మరియు ఎంపీపీ బత్తుల త్రిమూర్తులుని, మాజీ సర్పంచ్ మార్గాని ఆదినారాయణని ఇతర సీనియర్ నాయకులు వారి నివాసాల్లో గౌరవపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి, రాష్ట్ర అభివృద్ధితో యువత భవిష్యత్తు కాపాడుకుందామని తెలియజేసారు. జనసేన టిడిపి ఉమ్మడి కార్యాచరణతో భారీ విజయం తద్యమన్నారు. అనంతరం బత్తుల త్రిమూర్తులు, మార్గాని ఆదినారాయణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా, సమిష్టిగా కృషి చేసి పనిచేయాలని కోరారు. తెదేపా జనసేన పార్టీల ఉమ్మడి ధ్యేయం వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు రెండు పార్టీలతోనే సాధ్యమన్నారు. జనసేన టిడిపి ఉమ్మడి కార్యాచరణతో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి వైస్సార్సీపీ పార్టీ గద్దె దింపుదామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.