రాజానగరం జనసేన అడ్డా అని మరొక్కసారి నిరూపించిన “బత్తుల”
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం నుండి, రాజానగరం మండలం పాలచర్ల గ్రామాలకు చెందిన ఎమ్మార్పిఎస్ యువత, దళితులు మరియు బిసి వర్గానికి చెందిన సుమారు 300 మంది బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. సైకో పాలన చేస్తున్న జగన్ సర్కారుపై విరక్తి కలిగి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తున్న తీరు మరియు రాజానగరం నియోజవర్గంలో బత్తుల బలరామకృష్ణ పార్టీని అభివృద్ధి చేస్తున్న తీరు, కష్టాల్లో ఉన్న ప్రజలను తక్షణమే ఆదుకుంటున్న విధానం, నాయకులకు, జనసైనికులకు అందరికీ ఆయన ఇస్తున్న గౌరవం ఇవన్నీ నచ్చి బత్తుల బలరామకృష్ణ సమక్షంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రఘు, పల్లపాటి రవికుమార్, కాతేటి ప్రశాంత్ కుమార్, బాదంపూడి శ్రీను, కాతేటి వీరబాబు, కాతేటి వెంకన్న, కాతేటి వేణు, మందా నాగార్జున, వేమగిరి పండు, ఏనుగుపల్లి మోష్, వార కళ్యాణ్, వడ్లపాటి జీవన్ ప్రసాద్, మరియు ఇతర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-16.28.55-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-16.28.53-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-16.28.53-1-1024x682.jpeg)