మానేపల్లి వెంకటరామకృష్ణ ను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి
రాజానగరం: కోరుకొండ మండలం, రాఘవపురం గ్రామానికి చెందిన జనసేన నాయకులు మానేపల్లి వెంకటరామకృష్ణ తండ్రి సర్వేశ్వరావు ఇటీవల పరమపదించగా విషయం తెలుసుకున్న జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శ్రీనుని, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పడం జరిగింది. వీరి వెంట సీనియర్ నేత బదిరెడ్డి దొర, తోట అనిల్ వాసు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-7.35.10-PM-1024x768.jpeg)