ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందించిన బత్తుల వెంకటలక్ష్మీ

రాజానగరం నియోజక వర్గం: రాజానగరం మండలం, కలవచర్ల గ్రామానికి చెందిన పిల్లా దుర్గాప్రసాద్ కు ప్రమాదంలో కిడ్నీకి గాయం కాగా.. కలవచర్ల జనశ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి, కోలుకునే వరకూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి.. జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చి… వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది… ఈ కార్యక్రమంలో కలవచర్ల యువనాయకులు చల్లా రాము, జనసేన నేతలు యర్రా పుల్లయ్య, పెనుమాకుల వెంకన్న, దొడ్డ నాగన్న, అడ్డాల అప్పన్న, దొడ్డ వెంకటరావు, నారిపిరెడ్డి బుచ్చియ్య, సాధనాల సుబ్బారావు, అడ్డాల లీలా భగవాన్ సీనియర్ నేతలు మట్ట వెంకటేశ్వరరావు, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజ, బోయిడి వెంకటేష్, తోట అనిల్ వాసు మరియు కలవచర్ల జనశ్రేణులు పాల్గొన్నారు.