భూపాలపట్నం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి

రాజానగరం, భూపాలపట్నం దేవి నవరాత్రులు సందర్భముగా భూపాలపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. అనంతరం అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమానికి బత్తుల దంపతులు 5000/- రూపాయల విరాళాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం, బుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, బోయిడి వెంకట్, భూపాల సర్పంచ్ బుల్లింకల అన్నపూర్ణ మరియు భూపాలపట్నం గ్రామ ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.