కార్తీకమాస వన సమరాధాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల దంపతులు

రాజానగరం నియోజక వర్గం: కోరుకొండ మండలం, రాఘవపురం గ్రామంలో భారీ ఎత్తున జరిగిన కార్తీక మాస వన సమరాధాన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ..నా సేన కోసం నా వంతు కమిటీ కో’ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి. అన్నవితరణ కార్యక్రమం నిమిత్తం ₹10,000/- రూపాయలు చందాను కమిటీ వారికి అందజేసిన బత్తుల దంపతులు. ఈ కార్యక్రమంలో రాఘవపురం జనశ్రేణులు, బదిరెడ్డి దొర, మద్దిరెడ్డి బాబులు, తోరాటి శ్రీను, అడ్డాల దొరబాబు, పిల్లా శ్రీను ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.