పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు
రాజానగరం, కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులు పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.
- అంగవైకల్యంతో బాధపడుతున్న కొనకాల నాగేశ్వరరావు గారిని పరామర్శించి, జనసేన పార్టీ తరఫున రాబోవు రోజుల్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చి, మందుల ఖర్చు నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది..
- గ్రామస్తులు కాళ్ల చిన్న రామయ్య భార్య మరణించగా వారిని పలకరించి, మనోధైర్యం చెప్పడం జరిగింది.
- లివర్ కంప్లైంట్ తో బాధపడుతున్న దాయల శ్రీనుని పలకరించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకొని జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-10-at-19.38.52-2-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-10-at-19.38.52-3-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-10-at-19.38.52-1-1024x1024.jpeg)