పెదిరెడ్డి సాయిని పలకరించిన బత్తుల
రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, రాధేయపాలెం గ్రామానికి చెందిన పెదిరెడ్డి శ్రీను కుమారుడు పెదిరెడ్డి సాయి 24 గంటల నొప్పితో (ఎపెండిసైటిస్) బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ రాధేయపాలెం గ్రామాన్ని సందర్శించి – పెదిరెడ్డిని పలకరించి, శ్రీను ఆరోగ్యం తొందరగా మెరుగవడానికి అవసరమయిన ఎటువంటి సహాయాన్ని అందించడానికైనా జనసేన పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని గుర్తు చేస్తూ అయన సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబాన్ని ఓదార్చి, పెదిరెడ్డి శ్రీనుకు మనో ధైర్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో మన జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణతో పాటుగా జనసేన పార్టీ నాయకులు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, తూర్పు గాణుగూడెం సర్పంచ్ గల్లా రంగా, బోయిడి వెంకట్, నాతిపం దొరబాబు, అరిగెల రామకృష్ణ, ఈవూరి శ్రీనివాస్, సాపిరెడ్డి దుర్గారావు, కొప్పిరెడ్డి గోవింద్, ఉల్లింగి లక్ష్మణ్, మద్దినాల రామకృష్ణ, పెదిరెడ్డి శ్రీను, మద్దినాల మణికంఠ స్వామి, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-06-at-3.25.15-PM-1024x721.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-06-at-3.25.16-PM-1024x670.jpeg)