కోరుకొండ గ్రామంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన “బత్తుల”

రాజానగరం: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వలన ఇబ్బందులకు గురి అవుతున్న ఉపాధి హామీ కూలీలకు మరియు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని కోరుకొండ గ్రామంలో కోరుకొండ ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించారు. అనంతరం కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు, విద్యార్థులకు, పెద్దవాళ్లకు అందరికీ మజ్జిగ పాకెట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నిడిగట్ల శివ (జిల్లా సెక్రటరీ), మట్ట నాగేశ్వరరావు, బూరుగుపూడి విష్ణు, గాదరాడ దొర,రాజు, శ్రీరంగపట్నం శెట్టి, మధురపూడి ముత్యాలు, గల్లా శ్రీనివాసు, బొలెద్దు పాలెం భార్గవ్, గరగల పాలెం శ్రీనివాస్, కోటి కృష్ణ, మునగాల చిన్న శ్రీనివాస్, కనుపూరు బండి స్వామి, కోరుకొండ మధు, కాపవరం గణేష్, జంబుపట్నం సాయి, అయ్యప్ప, మాచవరం రామచంద్రరావు, మానేపల్లి వెంకట రామకృష్ణ, పోచంపేట బాపిరాజు, గాడాల జనసైనికులు, ఇతర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.