దసరా మహోత్సవ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ అందించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో దసరా మహోత్సవ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కి మేనేజ్మెంట్ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా హాజరైన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి తోకాడ ప్రజలు అపూర్వ స్వాగతం పలికడం జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ప్రైజ్ మనీ మరియు ట్రోఫీలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేడం జరిగింది. అనంతరం శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ జరిగిన పోటీలు యువతలో మరింత క్రీడాస్ఫూర్తిని పెంపొందించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి రాజానగరం పేరు దేశం నలుమూలాల విస్తరించేలా ప్రతీ ఒక్కరు శ్రమించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.