మిచౌంగ్ తుఫాన్ బాధితులకు అండగా బత్తుల

  • 600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ
  • తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాలని ఆదుకున్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మిచౌంగ్ తుఫాను కారణంగా పూర్తిస్థాయిలో దెబ్బతిన్న ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వారికి ఇచ్చిన మాట ప్రకారమే 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు 10,000/- రూపాయల ధన సహాయం చేసి పెద్ద మనసు చూపించారు. మిచౌంగ్ తుఫాన్ దాటికి కురిసిన అతి భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల శ్రీరంగపట్నం గ్రామం, దివాన్ చెరువు గ్రామాల్లో లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల జలదిగ్బంధమై ఇంట్లో నడుము లోతు నీరు నిలిచిపోవడం వల్ల కనీసం ఆహారాన్ని వండుకునే అవకాశం లేకుండా జనం ఇక్కట్లు పడుతున్నారు. త్రాగేందుకు నీరు లేదు.. నిత్యవసర సరుకులు అన్నీ తడిచిపోయి పాడైపోయాయి.. భోజనం టిఫిన్ వంటి కనీస ఆహారం లేక చిన్న పిల్లలు, వయోవృద్ధులతో కుటుంబాలన్నీ ఆకలితో అలమటిస్తున్నారు.. వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది.. కానీ ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వాధికారి గానీ, ప్రజా ప్రతినిధులు గాని, ఓట్ల కోసం వెంబడించే వాలంటీర్లు గాని, స్థానిక ఎమ్మెల్యే గాని చూసిన పాపాన పోలేదు.. ప్రజలంతా తిండి, నిద్ర కనీసం కూర్చోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో రోడ్లపై మేడలపై, ఇంటి ముంగిట వరద నీటిలో నిలుచుని సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థి రాజానగరం నియోజకవర్గం నుండి తన టీంతో వచ్చి కన్నీటి పర్యంతమై తక్షణం దివాన్ చెరువు గ్రామం, శ్రీరంగపట్నం గ్రామంలో సుమారు 600 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, మంచినీరు, నిత్యావసర సరుకులతో పాటు ఆహారం అందించారు.