ఈదురు గాలులకు ఇళ్ళు ఎగిరిపోయిన బాధితులకు అండగా బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో గురువారం విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం వలన ఇళ్ళు ఎగిరిపోయిన బాధిత కుటుంబాన్ని రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. మరుకుర్తి అప్పలరాజు బాధితుడు షెడ్ వేసుకుని చిన్నపాటి చిల్లర కొట్టు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. అతని కొట్టు, కొట్టు పైకప్పు మరియు సామాన్లు కూడా ఈదురుగాలులకు ఎగిరిపోయినవి. శ్రీరంగపట్నం జనసైనికులు ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పార్టీ తరపున కుటుంబాన్ని ఆదుకోవాలని భావించి జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి బాధిత కుటుంబాలను పరామర్శించి నిరాశ్రయుడు అయిన మరుకుర్తి అప్పలరాజుకి 25 కేజీల బియ్యం, ₹5,000/- రూపాయలు తక్షణ సాయంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శీలంశెట్టి వీర్రాజు, మద్దాల గంగాధర్, దేవన దుర్గా ప్రసాద్ (డిడి), దుడ్డి అప్పలరాజు, యర్రంశెట్టి పోలరావు, బత్తుల గోపాలకృష్ణ, కోలా శ్రీను, బొబ్బిలి సత్తిబాబు, గొడ్డేటి అప్పలరాజు, జమ్ముల స్వామి, మధు, ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.