శ్రీ కూనలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

సీతానగరం మండలం కూనవరం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కూనలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. కోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ శ్రీ శ్రీ కూనలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తె శ్రీమతి బత్తుల ప్రత్యూష దేవి విచ్చేసి, అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి ,తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆ తల్లి చల్లని చూపు ప్రతీ ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వరావు, కొండాటి సత్యనారాయణ, మాదవరపు కోటేశ్వరరావు, మాదవరపు వీరభద్రరావు, కోనే శ్రీను, ప్రగడ శ్రీహరి, ఎం. నరసింహ మూర్తి, గోకాడ సూర్యావతి, యర్రంశెట్టి పోలారావు, మదిరెడ్డి బాబులు, తోట అనిల్ వాసు, వేగిశెట్టి రాజు, నాగారపు సత్యనారాయణ, దాసరి రమేష్, బబ్బిరెడ్డి సూరిబాబు, తన్నీరు సురేష్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.