వినాయక అన్న సమారాధనలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: రాజానగరంలో పలు చోట్ల జరిగిన వినాయక అన్న సమారాధనలో గురువారం జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. సీతానగరం మండలం చిన్నకొండెపూడి గ్రామంలో వినాయక ఆలయంలో స్వామి వారిని దర్శించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నసమారాధనకు వచ్చిన భక్తులకు స్వయంగా అన్న వితరణ చేసారు. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో వినాయక ఆలయంలో స్వామి వారిని దర్శించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నసమారాధనకు వచ్చిన భక్తులకు స్వయంగా అన్న వితరణ చేసారు. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో వినాయక ఆలయంలో స్వామి వారిని దర్శించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నసమారాధనకు వచ్చిన భక్తులకు స్వయంగా అన్న వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట మట్ట వెంకటేశ్వరరావు, దాసరి రమేష్, చిక్కం నాగేంద్ర, తన్నీరు సురేష్, బొబ్బిరెడ్డి సూరిబాబు, వీరమహిళ వనుము వెంకట లక్ష్మి, కొనే శ్రీను, చిట్టి త్రిమూర్తులు, కంగళ్ల రఘు, సంగిశెట్టి శ్రీను, బైలపూడి శ్రీను, అడ్డాల శ్రీను, గుర్రాల చలం, దేవన దుర్గా ప్రసాద్ (డిడి), అడబాల బాబీ, శెట్టిబలిజ పేట గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.