శ్రీరంగపట్నం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు జాజుల కృష్ణ భార్య గత కొన్నిరోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన శ్రీరంగపట్నం చేరుకుని వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో మెట్ట రాజా రెడ్డి భార్య కీ.శే వరలక్ష్మి ఇటీవల స్వర్గస్తులైన విషయం స్థానిక జనశ్రేణులు ద్వారా తెలుసుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. అలానే డి.ఆర్ మెట్ట రాజా రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్న ప్రజా వైద్యశాలను సందర్శించిన “బత్తుల”. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, శ్రీరంగపట్నం గ్రామ జనసేన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-08-at-5.12.14-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-08-at-5.12.14-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-08-at-5.12.15-PM-1024x768.jpeg)