పలువురిని పరామర్శించిన బత్తుల
రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రాపాక గ్రామంలో జనసేన పార్టీ యువనాయకుడు ముత్యాల మహేష్ కాలికి ఇన్ఫెక్షన్ అయ్యి చికిత్స పొందుతున్నారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ వారిని పరామర్శించడం జరిగింది. సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామ మాజీ ఎంపిటిసి కావల గంగారావు అన్నయ్య భార్య సీతమహాలక్ష్మి ఇటీవల మరణించారనే వార్త స్థానిక జన శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి కుటుంబం సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు తూర్పు గానుగూడెం జనసేన పార్టీ సర్పంచ్ గళ్ళా రంగా, సీతానగరం మండల జనసేన కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, మట్ట వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ వీరమహిళలు కందికట్ల అరుణకుమారి ఓనము వెంకటలక్ష్మి, గోకాడ సూర్యవతి, కాత సత్యనారాయణ, మట్ట పోసియ్య, నాగారపు సత్తిబాబు, ప్రగడ శ్రీహరి, కొండేటి సత్యనారాయణ, మాదవరపు వీరబద్రరావు, సంగిశెట్టి స్వామి కాపు, గట్టి సత్యనారాయణ మూర్తి, మణిపవన్, షేక్ రబ్బానీ, గెడ్డం కృష్ణ చౌదరి, ముత్యాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-28-at-18.46.07-1-1024x769.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-28-at-18.46.07-1024x769.jpeg)