పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

  • యర్రంశెట్టి శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం: దివాన్ చెరువు గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీను మావయ్య ఇటీవల స్వర్గస్తులైనారు. బుధవారం జెడ్.రాఘంపేట గ్రామంలో జరిగిన పెదకార్యం కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, యర్రంశెట్టి ప్రసాద్, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • బల్ల అప్పన్న దొర కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల

తూర్పుగానుగూడెం జనసేన పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ బల్ల అప్పన్న దొర మావయ్య ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి కుటుంబసభ్యులను మురారి గ్రామంలో పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివ రామ్, తూర్పుగానుగూడెం జనసేన పార్టీ అబ్బిరెడ్డి సతీష్, వాసన అనిల్, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.