పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల
- యర్రంశెట్టి శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల
రాజానగరం: దివాన్ చెరువు గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీను మావయ్య ఇటీవల స్వర్గస్తులైనారు. బుధవారం జెడ్.రాఘంపేట గ్రామంలో జరిగిన పెదకార్యం కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, యర్రంశెట్టి ప్రసాద్, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-11-at-3.38.44-PM-1024x768.jpeg)
- బల్ల అప్పన్న దొర కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల
తూర్పుగానుగూడెం జనసేన పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ బల్ల అప్పన్న దొర మావయ్య ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి కుటుంబసభ్యులను మురారి గ్రామంలో పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివ రామ్, తూర్పుగానుగూడెం జనసేన పార్టీ అబ్బిరెడ్డి సతీష్, వాసన అనిల్, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-11-at-5.50.42-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-11-at-5.50.44-PM-1024x768.jpeg)