కాళీ కృష్ణ భగవాన్ మందిరాన్ని దర్శించిన బత్తుల

రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామంలో ప్రసిద్ధి గాంచిన కాళీ కృష్ణ భగవాన్ మందిరంలో అత్యంత భారీగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి బుధవారం పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.

  • రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో జనసేన నాయకులు మద్దిరెడ్డి బాబులు అత్తయ్య స్వర్గస్తులవడంతో వారి పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.
  • కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో కోడూరి గంగాభవాని ఇటీవల స్వర్గస్తులవడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది.
  • కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో సినవరపు బురయ్య ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

బత్తి నాగరాజును పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలంలో అధికార పార్టీ నాయకుల భూ కబ్జా దారులకు లోబడిన కోరుకొండ మండలం రెవెన్యూ అధికారుల ఒత్తిడికి లోనైన వెస్ట్ గానుగూడెం గ్రామానికి చెందిన బీసీ నాయకుడు బత్తి నాగరాజు పురుగులు మందు తాగి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారిని పరామర్శించి వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.