200 కార్లతో భారీ ర్యాలీగా జనసేనానికి ఘనస్వాగతం పలికిన బత్తుల

  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనకు
  • 200 కార్లతో భారీ కాన్వాయ్ గా వెళ్లి ప్రతిష్టాత్మకంగా స్వాగతం
  • రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర మూడు రోజుల పర్యటనకు విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు రాజానగరం నియోజవర్గం నుండి 200 కార్లతో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో భారీ కాన్వాయ్ గా వెళ్లి అధినేత పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు బత్తుల బలరామకృష్ణ చేసిన 200 కార్లతో ర్యాలీ బ్రహ్మాండంగా విజయవంతమైంది. జనసైనికుల మీద శ్రద్ధతో రాజానగరం నియోజవర్గ బత్తుల బలరామకృష్ణ మార్గమధ్యంలో జనసేన నాయకులకు, జనసైనికులకు, భోజన, ఫలహారాల ఏర్పాట్లను చేసి అందరి బాధ్యతను వ్యక్తిగతంగా దగ్గరుండి చూసుకుని జనసైనికులకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా చూసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన నాయకులకు కార్యకర్తలకు బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిశెట్టి శివరాం కిమిడీ శ్రీరామ్, చిట్టిప్రోలు సత్తిబాబు, నాతిపాము దొర, అరిగెల రామకృష్ణ, అడ్డాల శ్రీను, బదిరెడ్డి దొర, బోయిన వెంకటేష్, వేగిశెట్టి రాజు తదితర ముఖ్యులతో పాటు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.