అశ్రునయనాలతో ఘననివాళులు అర్పించిన బత్తుల

  • స్వర్గీయ పాఠంశెట్టి నారాయణరావుకు ఘన నివాళులు

జగ్గంపేట నియోజకవర్గం: మూర్తీభవించిన మానవత్వంతో.. మంచికి మారుపేరుగా నిలిచి, ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు పొంది గత కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైన జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర తండ్రి స్వర్గీయ పాఠంశెట్టి నారాయణరావు చినకార్యం బుధవారం కాగ ఈ కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి, ఇతర జనసేన సీనియర్ నాయకులు హాజరై పాఠంశెట్టి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసి, సూర్యచంద్ర కుటుంబ సభ్యులకు బత్తుల” దంపతులు మనోధైర్యాన్ని చెప్పారు. నారాయణరావు కు నివాళులర్పించిన వారిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి శివరామ్, తూర్పుగోనుగూడెం సర్పంచ్ గల్లా రంగా, సీనియర్ నేత మద్దిరెడ్డి బాబులు, గంగిశెట్టి రాజేంద్ర, చిట్టిప్రోలు సత్తిబాబు, అడబాల శ్రీనివాసు, వేగిశెట్టి రాజు, దేనిడి మణికంఠ స్వామి(డి.ఎం.ఎస్), యర్రంశెట్టి పోలారావు, అడ్డాల దొరబాబు, ఇతర జనసైనికులు ఉన్నారు.