రోజూ కొంత సమయం కేటాయించి కష్టపడదామని బత్తుల పిలుపు

  • జనహితమే తన అభిమతంగా ముందుకు సాగుతున్న నేత “పవన్ కళ్యాణ్”
  • భావితరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పరితపిస్తుంటారు
  • రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట “పవన్ రావాలి – పాలన మారాలి”

రాజానగరం, “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” కార్యక్రమంలో భాగంగా “ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం” రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల, మహిళల, విశేష ఆదరణతో, సుదీర్ఘంగా గ్రామంలో కొనసాగింది. స్థానిక గ్రామస్తులతో బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఈ అరాచక పాలన నుండి విముక్తి పొందాలంటే అందరూ సమిష్టిగా మాట్లాడుకుని, మంచి పాలన కోసం ‘గాజు గ్లాస్’ గుర్తుపై ఓటు వేసి, ‘పవన్ కళ్యాణ్’ కి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నత ఆశయం ఉన్న నాయకుడు మన రాష్ట్రానికి లభించడం మన అదృష్టమని, ఆయన రాజకీయ లక్ష్యం కోసం జనసైనికులు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కష్టపడి, పార్టీ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిస్తున్నానన్నారు. దివాన్ చెరువు గ్రామంలో జరిగిన “మహాపాదయాత్ర” లో గ్రామ జనసేన యూత్, వీరమహిళలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.