ఆప్యాయతలు పలకరింపులతో ముందుకు సాగిన బత్తుల భారీ బైక్ ర్యాలీ

  • బత్తుల దంపతులకు బ్రహ్మరధం పట్టిన జనశ్రేణులు
  • అడుగడుగునా హారతులు పట్టిన ఆడపడుచులు..

రాజానగరం నియోజకవర్గం: బొబ్బిలంక గ్రామం నుండి చినకొండేపూడి గ్రామం వరకు జరిగిన భారీ బైక్ ర్యాలీలో భాగంగా రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి లను చూడడానికి అశేషమైన ప్రజానీకం వచ్చింది. ప్రతీ ఒక్కరికీ అభివాదం చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. గ్రామంలోని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి బత్తుల పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కర్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.