క్రియాశీల సభ్యులుగా చేరి ఇన్సూరెన్స్ పథకంలో భాగస్వాములు కండి

జనసేనాని కార్యకర్తలకు అండగా నిలబడే గొప్ప మనసున్న నాయకుడు. వెంటనే మలిదశ క్రియాశీల సభ్యత్వము నమోదు చేయించుకుని ఐదు లక్షల ఇన్సూరెన్స్ పథకంలో భాగస్వాములు కండి. బండారు శ్రీనివాస్ జనసేన పార్టీ ఇన్చార్జి పిలుపు!

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, జనసేన పార్టీ ఇన్చార్జ్, ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల కోసం, జనసేనాని అభిమానుల కోసం పార్టీలోకి కొత్తగా చేరే ప్రతి ఒక్కరికి, జన సైనికులకు మలిదశ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా క్రియాశీల కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకంలో సభ్యులుగా చేరే అవకాశం ఈ సంవత్సరం మరల తిరిగి ప్రారంభం అయినదని తెలియజేశారు. ప్రతి ఒక్క జన సైనికులూ, కార్యకర్తలూ వెంటనే మలిదశ క్రియాశీలసభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ పథకం భాగస్వాములు కావాల్సిందిగా కోరుచున్నాము. గొప్ప మనసున్న మంచి నాయకుడు జనసేనాని, కార్యకర్తల బాగోగులు కోసం నిరంతరము ఆలోచించే ఏకైక నాయకుడని, జనసేనాని పవన్ కల్యాణ్ ఎంతో గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప హర్షణీయమని.. ఈ విధంగా ఏ పార్టీలోనూ కార్యకర్తలను ఆదుకునే ఇలాంటి అవకాశం లేదని.. పార్టీలోని కార్యకర్తల కోసం తనను నమ్ముకున్న అభిమానుల కోసం ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి, ప్రమాదవశాత్తు ఇబ్బందులు ఎదురైనా.. జనసేన కార్యకర్తలకు తన పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యత్వం 500/-ఇచ్చి సభ్యత్వం పొందిన జన సైనికులకు, వారి కుటుంబాలకు ఎంతో అండగా ఈ పథకం అండగా నిలబడటం అనే విషయం ఎంతో గొప్పదని.. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యులు గా జనసేన పార్టీకి జనసేనానికి అండగానిలబడి, క్రియాశీల సభ్యులుగా చేరి, ఇన్సూరెన్స్ పథకంలో భాగస్వాములు అయ్యి వినియోగించు కోవాలని బండారు శ్రీనివాస్ తెలియజేశారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-02-23-at-5.12.23-PM-1024x461.jpeg
This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-02-23-at-5.12.24-PM-1024x576.jpeg