వాలంటీర్ల ఆగడాలపై ద్వజమెత్తిన బెజవాడ దినేష్

  • వాలంటీర్ల ఆగడాలపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన జనసేన !

పీలేరు నియోజకవర్గం: వాలంటీర్ల ఆగడాలపై పీలేరు నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో గురువారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పీలేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్ మాట్లాడుతూ.. ఆగస్టు 31న పీలేరులో ఆటో డ్రైవర్ను కొందరు దుండగులు సైనైడ్ ఇంజక్షన్ తో పొడిచి చంపారు, నిందితుల గురుంచి పోలీసు వారు ఎంక్వయిరీ చేయగా ప్రధాన నిందితుడు వార్డు వాలంటీర్ కిషోర్ అని తేలింది. హత్యకు కారణాలు వెతగ్గా హత్య చేయబడ్డ అతను పొట్ట చేత పట్టుకొని బ్రతుకు దెరువు కోసం కువైట్ కి పోగా ఒంటరి మహిళ అయిన తన భార్యని వాలంటీర్ కిషోర్ లోబరచుకొని తన కామ వాంచ తీర్చుకోసాగాడు. ఇటీవల కువైట్ నుండి భర్త తిరిగి రావడంతో తన పనికి అడ్డుతగులుతున్నాడని పథకం ప్రకారం ఆగస్టు 31న హత్య చేసారు. రెండున్నర నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు వాలెంటీర్ వ్యవస్థలో లోటుపాట్ల గురించి, మంచిచెడులు గురించి వాలెంటీర్లు ఒంటరి మహిళలని ఎలా టార్గెట్ చేస్తున్నారో ప్రశ్నించినందుకు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, బొమ్మలు తగలబెట్టారు. మరి పీలేరులో ఆ రోజు రోడ్డు ఎక్కిన వాలంటీర్లు ఇపుడు ఏమంటారు??? ఆ హత్యలో రోడ్డు ఎక్కిన వాలెంటీర్లకి భాద్యత ఉంది అని ఒప్పుకుంటారా? లేక మా పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు రామ శ్రీనివాస్, రెడ్డప్ప, పవన్, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.