బెంతు ఒరియాల నిరసన 25వ రోజు

ఇచ్చ్చాపురం: బెంతు ఒరియా కులస్తులు ధ్రువపత్రాలు పునరుద్దరణ కొరకు కొనసాగిస్తున్న 25వ రోజు దీక్షకు బృందావన్ సాహు, ఖేత్రో, సుర్జోమొని, మోహన్ మజ్జి, జోగోబొందు దొలై ఆధ్వర్యంలో పలు సామాజిక వర్గస్తులు వచ్చి సంఘీభావం తెలిపారు. బెందలం ప్రవీణ్, గంగాధర్, కాకర్ల కామేష్, యస్ సి సెల్ కార్యదర్శి ఎం పూర్ణ , వైశ్య మోహనరావు, తిరుపతి,ఈ సందర్భంగా బెంతు ఒరియలకు న్యాయం చేయాలని వారు ఆర్థికంగా వెనుకబడిన వారని ప్రభుత్వ పథకాలు నోచుకోలేని దుస్థితిని రాజ్యాంగ హక్కును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖేత్రో, జగర్ణత్, ఢిల్లీ, లోకనాత్, సంతోష్, సుమన్, దినబందు, బెదోబోరో, జగన్, జయసేన్, గోపి, సుధాకర్, దుదిస్తి తదితులు పాల్గొన్నారు.