ఉత్తమ జనసైనిక్ అవార్డు బహుకరణ

ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే జనసైనికుడు 2024 లో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని సైకిల్ యాత్ర ప్రారంభించి అమరావతి చేరుకుని, అనంతరం మంగళగిరి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అధినేత పేరు మీద ప్రత్యేక పూజలు చేయించిన సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గ కార్యాలయంలో ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు అభినందనలు తెలిపి సన్మానం చేసి, ఉత్తమ జనసైనిక్ అవార్డు ను బహుకరించారు.