కొటికలపూడి గోవిందరావుకు శుభాకాంక్షలు

భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావును ఆదివారం పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి చిర్రి బాలరాజు మరియు ఏడు మండలాల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీలో సభ్యులుగా ఎన్నికైనందుకు గాను పోలవరం నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, కుక్కునూరు మండల అధ్యక్షులు యుగేందర్, వేలూరుపాడు మండల అధ్యక్షులు గణేసుల ఆదినారాయణ, టీ నర్సాపురం మండల అధ్యక్షులు అడపా నాగరాజు, పోలవరం మండల అధ్యక్షులు చిన్ని, బుట్టాయిగూడెం మండల అధికార ప్రతినిధి నట బుచ్చిరాజు పాల్గొన్నారు.