పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షుడిగా బేతంచర్ల ప్రసాద్
గురజాల నియోజకవర్గం: పిడుగురాళ్ల మండల జనసేన ఉపాధ్యక్షుడిగా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన, బేతంచర్ల ప్రసాద్ ని జిల్లా అధ్యక్షులు శుక్రవారం గాదె వెంకటేశ్వరరావు నూతనంగా నియమించడం జరిగింది. ఈ మేరకు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా బేతంచర్ల ప్రసాద్ మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షులు వారికి మరియు పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-08-at-3.05.05-PM-1024x769.jpeg)